యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణం: కేబినెట్లో మైనార్టీకి ఛాన్స్, హాజరైన అఖిలేష్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు. 47 మందితో ఈయన కేబినెట్ కొలువు తీరుతోంది.
లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉప్వన్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో 44 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది. మైనార్టీ మోసిన్ రాజాకు మంత్రి పదవి దక్కింది.

ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, గడ్కరీ, వెంకయ్య నాయుడు, శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు హాజరయ్యారు.
యూపీలో 403 స్థానాలకు గాను బీజేపీ 312 సీట్లను సొంతంగా గెలుచుకుంది. దాని మిత్రపక్షాలు అప్నాదళ్(ఎస్) 9, ఎస్బీఎస్పీ 4 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో బీజేపీ కూటమి బలం 325కు చేరింది. దీంతో దశాబ్దంన్నర తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత వారం పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ శనివారం శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్ను పార్టీ ఎంపిక చేసింది.
ఆదిత్యనాథ్ యూపీకి 21వ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో బీజేపీ తరపున సీఎం పదవిని చేపట్టిన వారిలో ఆయన నాలుగో వ్యక్తి. ఆయనకు ముందు పార్టీకి చెందిన కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కల్యాణ్ సింగ్ రెండుసార్లు ఆ బాధ్యతలను చేపట్టారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications