శుభవార్త: ఆ చెక్బుక్లు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు
ఎస్బిఐలో విలీనమైన బ్యాంకుల చెక్బుక్లు 2017, డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయి.కష్టమర్ల వినతి కోసం ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకొంది.ఎస్బిఐ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
న్యూఢిల్లీ: తన కస్టమర్లకు ఎస్బిఐ శుభవార్త అందించింది. ఎస్బిఐలో విలీనమైన బ్యాంకులకు చెందిన చెక్బుక్లు డిసెంబర్ 31, 2017 వరకు చెల్లుబాటు అవుతాయని ఎస్బిఐ ప్రకటించింది.
భారతీయ మహిళా బ్యాంకుతో సహా ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అనుబంధ బ్యాంకులు జారీచేసిన చెక్కులేవీ సెప్టెంబర్ 30 తర్వాత చెల్లబోవంటూ జారీచేసిన ఆదేశాలపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెనక్కి తగ్గింది

. అసోసియేట్ బ్యాంకుల చెక్కుల వాలిడిటీని 2017 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. అప్పటి వరకు కొత్త ఎస్బీఐ చెక్ బుక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్బిఐ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
హోమ్ బ్రాంచ్ను సందర్శించి లేదా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా కొత్త చెక్ బుక్కులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఎస్బీఐలో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్కులు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు సెప్టెంబర్ 30 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త వాటికే అనుమతిస్తామని ఎస్బీఐ ఇంతకుముందు ప్రకటించింది.
అయితే పోస్టు డేటెడ్ చెక్కులు తీసుకున్న వారి పరిస్థితి దారుణంగా మారడంతో, ఎస్బీఐ ఈ నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గింది. ఆ గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications