బెంగళూరులో మేడ మీద నుంచి రోడ్డులో చెత్తవేశాడు: యువకుడిని ఇలాగే చంపేశారు !
బెంగళూరు: రోడ్డు మీద చెత్త వేశాడని కోపంతో యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గిరినగరలో నివాసం ఉంటున్న దేవరాజ్ (28) అనే యువకుడు హత్యకు గురైనాడు.
గిరినగరలోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో దేవరాజ్ నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి దేవరాజ్ మేడ మీద నుంచి రోడ్డు మీదకు చెత్తవేశాడు. ఆ సందర్బంలో రోడ్డు మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ముగ్గురు యువకులు నిలబడి ఉన్నారు.

రోడ్డు మీద ఎందుకు చెత్త వేశావు అని ముగ్గురు యువకులు దేవరాజ్ ను ప్రశ్నించారు. ఆ సందర్బంలో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ముగ్గురు యువకులు దేవరాజ్ నివాసం ఉంటున్న కట్టడం మీదకు వెళ్లారు.
దేవరాజన్ ను పట్టుకుని వెళ్లి చెత్త ఎక్కడి నుంచి వేశాడో అక్కడి నుంచి అతన్ని కిందకు తోసేశారు. తీవ్రగాయాలైన దేవరాజ్ ను ఆసుపత్రికి తరలించగా మరణించాడని అతని కుటుంబ సభ్యులు గిరినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దేవరాజ్ ను దారుణంగా హత్య చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications