ప్రియురాళ్ల సంతోషం కోసం దోపిడీలకు తెగబడ్డాడు
నాగపూర్: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు యువతులతో ప్రేమాయణం సాగించాడో ప్రబుద్దుడు. ఆ ఏడుగురు ప్రియురాళ్లను సంతోష పెట్టడం కోసం దోపిడీలు, దొంగతనాలకు తెగబడ్డాడు. ఈ విషయం పోలీసులకు పట్టబుడిన ఆ యువకుడు చెప్పడటంతో వారు నివ్వెరపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహారాష్ట్రలోని బల్దాన జిల్లాకి చెందిన పోలీసులు ఓం ప్రకాశ్ రంగనాథ్ ఖండారే(26)ని అరెస్టు చేశారు. తొమ్మిది దోపిడీ కేసుల్లో అతడు ప్రధాన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓంప్రకాశ్పై పలు ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీ కేసులు నమోదయ్యాయి.

మద్యానికి బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓం ప్రకాశ్ ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు. అదుపులోకి తీసుకున్న అతడి దగ్గర నుంచి 17 మొబైల్ ఫోన్లు, రూ.4.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించిన పోలీసులు ఓం ప్రకాశ్ చెప్పిన సమాధానానికి కంగుతిన్నారు.
తనకున్న ఏడుగురు గర్ల్ఫ్రెండ్స్ను సంతోషపెట్టడానికి దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పాడు. నిందితుడిపై ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు నగరాల్లో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
ఓంప్రకాశ్ వద్దనుంచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏసీ కంపార్ట్మెంట్లలో ప్రయాణించి అనేకమంది ప్రయాణికుల వద్ద కూడా ఓంప్రకాశ్ దోపీడీలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications