వీడు మామూలోడు కాదు.. సుశాంత్ సింగ్ గురించి ఫేక్ వీడియోలు, 4 నెలల్లో 4 రాళ్లు వెనకేశాడు..
టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో మొబైల్.. తెరిస్తే వెబ్ సైట్లు.. లేదంటే యూట్యూబ్... ఏ సమాచారం అయినా క్షణాల్లో తెలిసిపోతుంటుంది. అయితే అలా యూజర్ల వీక్నెస్ను కొందరు క్యాష్ చేసుకుంటారు. ఏ విషయం జరిగింది జరిగినట్టు రిపోర్ట్ చేస్తే ఫరావలేదు.. కానీ లేనిది ఉన్నట్టు చెప్పి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే మన మధ్య లేని వారి (చనిపోయిన) వారి గురించి లేనిది చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. బీహర్కు చెందిన యూ ట్యూబర్ కూడా అచ్చం ఇలాగే వ్యవహరించాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఊహాగానాలతో వీడియోలు చేసి సంపాదించాడు.
25 ఏళ్లే కానీ..
రషీద్ సిద్దిఖీ.. 25 ఏళ్ల సివిల్ ఇంజినీర్. బీహర్ రాష్ట్రం.. ఇతనికి ఎఫ్ఎఫ్ న్యూస్ అనే య్యూట్యూబ్ చానెల్ ఉంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి రకరకాల స్టోరీలు చేసి బాగానే సంపాదించాడు. 4 నెలల్లో రూ.15 లక్షలు వెనకేసుకున్నాడు. రాజ్ పుత్ కాదు.. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి కూడా ఇదేవిధంగా పోస్టులు చేశారని మిడ్ డే రిపోర్ట్ చేసింది.
చాలా మంది చూడటంతో..
రాజ్ పుత్ మృతి గురించి చేసిన కథనాలు అతని యూ ట్యూబ్లో ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే రూ.6.5 లక్షలను సంపాదించడంటే.. ఏ స్థాయిలో స్టోరీస్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మిగతా లక్షలు 3 నెలల్లో ఆర్జించాడు. రాజ్ పుత్ మరణం కంటే అతని యూ ట్యూబ్కు 2 లక్షల సబ్ స్కైబర్స్ ఉండగా... చనిపోయాక వారి సంఖ్య 3.70 లక్షలకు చేరింది.
హాట్ కేక్
రాజ్ పుత్ మరణాన్ని తన పెట్టుబడిగా అనుకున్నాడు. చేసే ఒక్కో స్టోరీ చదవడంతో.. పదే పదే అవే కథనాలు చేశారు. వాటిని చూసేందుకు జనం కూడా ఎగబడ్డారు. దీంతో యూ ట్యూబ్ చానెల్కు చాలా వ్యుహ్ వచ్చాయి. జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన నివాసంలో రాజ్ పుత్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.