Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే దెబ్బకు మూడు పిట్టలు, చంద్రబాబు, బాలయ్య, పవన్ ల మీద పెద్దిరెడ్డి ప్రయోగం, జగన్ స్కెచ్!

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కడప జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించి ఆ నియోజక వర్గాల్లో గెలుపు బాధ్యత మీదే అని సీఎం వైఎస్ జగన్ సూచించారని సమాచారం.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి సొంత తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముద్దుల కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ టిక్కెట్ మీద రాజంపేట లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

YS Jagan and Peddireddy targeted Kuppam Hindupuram and Pithapuram

సొంత నియోజక వర్గం పుంగనూరుతో పాటు తంబళ్లపల్లె, రాజంపేట, మదనపల్లె, పీలేరు, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు, నగిరి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, కదిరి, శ్రీకాళహస్తి, పుట్టపర్తి, మడకశిర, రాప్తాడు, హిందూపురం తదితర నియోజక వర్గాల ఇన్ చార్జ్ బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డకి అప్పగించారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు. హిందూపురం లోక్ సభ నియోజక వర్గాల బాధ్యత కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటున్నారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం వైసీపీ బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటున్నారు. గతంలో జరిగిన కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి మెజారిటీ తగ్గిపోవడానికి, కుప్పం మునిసిపాలిటిలో వైసీపీ జెండా ఎగరడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి కుప్పంను టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి ఈసారి చంద్రబాబును ఓడించాలనే ప్లాన్ చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

అయితే ఇందులో నగిరి నియోజక వర్గం మినహాయించి మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు, లోక్ సభ నియోజక వర్గాల ఇన్ చార్జ్ లతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్థానిక అభ్యర్థులను గెలిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలయ్య హ్యాట్రిక్ కొట్టకుండా ఆయన్ను ఓడించే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీసుకున్నారని సమాచారం.

YS Jagan and Peddireddy targeted Kuppam Hindupuram and Pithapuram

ఇప్పటికే హిందూపురంలో అనేక సభలు, సమావేశాలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతిని హిందూపురంలోనే పెట్టి బాలయ్య ఓటమికి పావులు కదుపుతున్నారని తెలిసింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొటీ చేస్తున్న పిటాపురంలోని ఒక మండలం ఇన్ చార్జ్ బాధ్యతలను వైసీపీ ఎంపీ, మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారని ఇప్పటికే తెలిసింది.

మిథున్ రెడ్డి సైతం పిఠాపురంలోని ఆ మండలం వైసీపీ నాయకుతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వంగా గీత గెలుపుకు పని చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలయ్యను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోని ఓ మండలంలో ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు, బాలయ్య, పవన్ కల్యాణ్ మీద పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+