జగన్కు టిపై మమత బెనర్జీ హామీ, తమ్ముడన్న దీదీ
కోల్కతా/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. జగన్కు మమత నుండి హామీ లభించింది.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ విభజనపై ఏకపక్షంగా వెళ్తోందని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే వ్యతిరేకించాలని కోరారు. అదే సమయంలో జగన్ మాట్లాడుతూ.. విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని చెప్పారు. ఆర్టికల్ 3ని సవరించాలని చెప్పారు. రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లుగా వుభజిస్తే కుదరదని, విభజనకు ఓ ప్రాతిపదిక ఉండాలని జగన్ అన్నారు.

జగన్ తమ్ముడిలాంటి వారు: మమత
వైయస్ జగన్ తనకు తమ్ముడిలాంటి వారని మమతా బెనర్జీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తానెప్పుడు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని చెప్పారు. అందరూ కలిసి ఉండాలన్నదే తన భావన అన్నారు. కావాలంటే కొన్నిచోట్ల మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని, అంతే తప్ప విభజిస్తూ పోతే మాత్రం సమస్య పరిష్కారం కాదన్నారు.

కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకొని కోల్కతా, లక్నోలో పర్యటిస్తున్నారు. ఈ రోజు కోల్కతాలో మమతను కలిసిన జగన్ గురువారం యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కలుసుకోనున్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications