విభజన: జయలలితతో జగన్, చెన్నైలోనూ ఘనస్వాగతం
చెన్నై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితతో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టడంలో భాగంగా జగన్ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా బుధవారం చెన్నైకి వచ్చిన జగన్ తమిళనాడు ముఖ్యమంత్రిని కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరారు. గతంలో జగన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, బిజెపి, లెఫ్ట్ పార్టీల నేతలను కలిశారు.

కాగా, అంతకుముందు చెన్నై విమానాశ్రయంలో జగన్కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు గంటలకు జయలలితతో భేటీ అయిన జగన్ సాయంత్రం ఐదు, ఆరు గంటల మధ్య డిఎంకె అధినేత కరుణానిధిని కలుసుకుంటారు.

చెన్నై విమానాశ్రయంలో దిగిన జగన్ నేరుగా తన సోదరుడు వైయస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుండి పార్టీ ప్రతినిధులు, బంధువులను కలుసుకున్నారు. రాత్రి చెన్నైలోనే బస చేసి గురువారం హైదరాబాదుకు వస్తారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications