Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్రవాది ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి

నైరుతి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సూఫీ టెంపుల్ వద్ద గురువారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బలూచిస్తాన్: నైరుతి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సూఫీ టెంపుల్ వద్ద గురువారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఝల్ మగ్బీ టెంపుల్ ప్రాంగణంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఉన్నట్లుండి పెద్ద పెట్టున పేలుడు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఉగ్రవాది భక్తుడిలా సూఫీ టెంపుల్ పరిసరాల్లో సంచరించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

balochistan-attack

పోలీసులు అతడిని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆ ఉగ్రవాది తనను తానే పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందడంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మసీదులను టార్గెట్ చేసే తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+