ప్యారిస్ ఆపరేషన్ పూర్తి: ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
ప్యారిస్: గత మూడు రోజుల పాటు ప్యారిస్ను గుప్పిట పట్టి భయోత్పాతాన్ని సృష్టించిన ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు తమ ఆపరేషన్లో కాల్చి చంపేశారు.. శుక్రవారం మరో ఐదుగురిని బందీలుగా తీసుకుని అలజడి రేకెత్తించిన మిలిటెంట్లను పట్టుకునేందుకు ఏకంగా 2వేలమంది పోలీసులు రంగంలోకి దిగి అన్ని వైపులనుంచి వారిని కట్టడి చేశారు.
తీవ్ర స్థాయిలో ఉత్కంఠ, అలజడి నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. బందీలకు ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా విడిపించారు. అంతకుముందు దేశ రాజధాని ప్యారిస్ తూర్పు ప్రాంతంలోని కోషెర్ సూపర్ మార్కెట్లో శుక్రవారం ఐదుగురిని నిర్బంధించి ఉగ్రవాదులు సరికొత్త డ్రామాకు తెర లేపారు. గురువారం ఒక మహిళా పోలీసును కాల్చిచంపినట్లు అనుమానిస్తున్న ఆగంతకుడే తాజాగా కోషెర్ మార్కెట్లో దాడికి దిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ దాడిలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయని, మరో ఐదుగురిని ఆ ఆగంతకుడు నిర్బంధించాడని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలావుంటే, చార్లీ హెబ్డో వద్ద కొద్ది రోజుల క్రితం 12 మంది అమాయకులను ఊచకోత కోసినట్లుగా అనుమానిస్తున్న కౌచీ సోదరులను డమ్మార్టిన్ ఎన్ గొయెల్ పట్టణంలో భద్రతా బలగాలు చుట్టుముట్టి హెలికాప్టర్ల సహాయంతో ముప్పేట దాడికి సిద్ధమయ్యాయి.
ఈ ప్రాంతం ప్యారిస్లోని ప్రధాన విమానాశ్రయానికి (గల్లె ఎయిర్పోర్టుకు) కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఉగ్రవాద దాడులకు భయపడి స్థానిక ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రాకపోవడంతో ప్రస్తుతం డమ్మార్టిన్ ఎన్ గొయెల్లో ఏ వీధి చూసినా సాయుధ కమెండోలు, పోలీసులే దర్శనమిస్తున్నారు. కౌచీ సోదరుల కోసం వారు విస్తృత స్థాయిలో వేట ప్రారంభించారు. అంతకుముందు హైస్పీడ్ కారులో డమ్మార్టిన్ ఎన్ గొయెల్లోని ప్రింటింగ్ కార్యాలయం వైపునకు దూసుకొస్తున్న కౌచీ సోదరులను పోలీసులు తీవ్రస్థాయిలో వెంబడించడంతో పాటు వారిపై కాల్పులు కూడా జరిపారు.
అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని ప్రాసిక్యూటర్లు ఎఎఫ్పి వార్తా సంస్థకు తెలిపారు. దుండగులు నల్లటి రంగులో ఉన్న బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని, వారి వద్ద ‘కలష్నికోవ్' (ఎకె) తరహా ఆయుధాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ఉగ్రదాడుల నేపథ్యంలో ప్యారిస్ తోపాటు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాలను పోలీసులు తమ నిఘా నీడలోకి తీసుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications