Morocoo Earthquake: మొరాకో భూకంపంలో 2 వేలకు చేరిన మృతుల సంఖ్య..

మొరాకోలో ఎటు చూసిన శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఈ ఘోర భూకంపానికి 2 వేలకు పైగా మంది మరణించారని అధికారులు తెలిపారు. 1404 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సహాయక బృందాలు మారుమూల పర్వత గ్రామాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ భూకంపంతో ప్రజలు మరణించడంతో అధికారులు మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. పర్యాటక నగరమైన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల (45 మైళ్లు) పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

తీరప్రాంత నగరాలైన రాబాట్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంపం భారీ నష్టాన్ని కలిగించింది. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్రనష్టం జరిగింది. "నేను భయంతో బయటకి వెళ్లాను, నేను ఒంటరిగా చనిపోతానని అనుకున్నాను" అను భూకంపం సంభవించినప్పుడు మరకేష్‌ను సందర్శిస్తున్న 80 ఏళ్ల వయస్సులో ఉన్న కాసాబ్లాంకా నివాసి ఘన్నౌ నజెమ్ చెప్పారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పర్వత గ్రామమైన టఫెఘాగ్టేలో భవనాలు కూలిపోయాయి.

2 thousand people died in the earthquake in Morocco

సైనికులు శిధిలాల్లో చిక్కుకున్న వారికి కోసం వెతుకుతున్నారు అయితే చాలా మంది ప్రాణాలతో బయటపడిన వారు స్మశానవాటికకు వెళ్లారు. అక్కడ దాదాపు 70 మంది గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. "నా ముగ్గురు మనుమలు మరియు వారి తల్లి చంపబడ్డారు. వారు ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నారు" అని గ్రామస్థుడు ఒమర్ బెన్హన్నా పేర్కొన్నాడు. ఇది ఉత్తర ఆఫ్రికన్ రాజ్యాన్ని తాకిన అత్యంత బలమైన భూకంపం ఇది. ఒక నిపుణుడు దీనిని "120 సంవత్సరాలలో అతిపెద్దది" అని అభివర్ణించారు.

శనివారం చివరిలో అంతర్గత మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం భూకంపం వల్ల కనీసం 2,012 మంది మరణించారు. అత్యధికులు అల్-హౌజ్, భూకంప కేంద్రం మరియు తరౌడాంట్ ప్రావిన్సులలో ఉన్నారు. మరో 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. "అసాధారణమైన అత్యవసర పరిస్థితి సృష్టించింది" అని సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్న సివిల్ డిఫెన్స్ కల్నల్ హిచమ్ చౌక్రీ చెప్పారు.

మొరాకోలో ప్రాణనష్టం, విధ్వంసం పట్ల తాను చాలా బాధపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ప్రధాని మోడీ కూడా బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. చైనా నాయకుడు జి జిన్‌పింగ్ "బాధితులకు తీవ్ర సంతాపం" వ్యక్తం చేశారు. 2004లో ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భూకంపం సంభవించినప్పుడు కనీసం 628 మంది మరణించారు. 926 మంది గాయపడ్డారు. 1960లో అగాదిర్‌లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 12,000 మందికి పైగా మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+