ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ ప్రమాద ఘటన కైరో నుంచి 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మరణించారు.

అస్సియట్ గవర్నర్ ఎస్సామ్ సాద్ ప్రకటన ప్రకారం.. కైరో నుంచి అసియట్కు వెళుతున్న బస్సు.. ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రెండు వాహనాలు దగ్ధం కావడంతో అక్కడ పరిస్థితి భీతావాహంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
దేశ అధికారిక గణాంకాల ప్రకారం ఈజిప్టులో 2019లో సుమారు 10,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 3480 మందికిపైగా మరణించారు. 2018లో 8480 కారు ప్రమాదాల్లో 3080 మంది ప్రాణాలు కోల్పోయారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications