ఇరాక్: పెప్సీ ఫ్యాక్టరీలో చిక్కుకున్న ఎపి, టి వాసులు
న్యూఢిల్లీ: ఇరాక్లో అంతర్యుద్ధం నేపథ్యంలో... పెప్సీ కంపెనీలో 250 మంది తెలుగు కార్మికులు చిక్కుకుపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు పెప్సీ కంపెనీలో చిక్కుకుపోయారు. ఈ కంపెనీకి బయట తీవ్ర బాంబుల మోత, కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ సమయంలో కంపెనీ యాజమాన్యం కార్మికులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. బయట పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారి పాస్పోర్టులు కూడా హ్యూమన్ సోర్సెస్ మోనేజర్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు.

పెప్సీ కంపెనీ మూడు రోజులుగా మూతబడింది. అందులోనే వారు ఉన్నారు. మూడు రోజులుగా వారికి తిండి, తిప్పలు లేదు. పెప్సీ కంపెనీలో చిక్కుకున్న వారిలో తెలంగాణలోని అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉభయ గోదావరి జిల్లా వారు ఉన్నారు.
కాగా, ఇరాక్లో తెలంగాణ వారు 1038 మంది చిక్కుపోయినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది కాలంలో ముంబై విమానాశ్రయం నుండి 858 మంది, జైపూర్ విమాశ్రయం నుండి 180 మంది వెళ్లినట్లు సమాచారం సేకరించింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications