డానిష్ బిలియనీర్ ఇంట కడుపుకోత : లంక పేలుళ్లలో ముగ్గురు పిల్లల మృతి
కోపెన్ హిగన్ : ఈస్టర్ సండే రోజున శ్రీలంక జరిగిన మారణహోమం మృతుల కుటుంబాల్లో విషాదం నింపింది. నిన్న జరిగిన పేలుళ్లలో డెన్మార్క్ బిలియనీర్ అండేర్స్ హోల్చ్ పోల్సెన్ ఇంట్లో కడుపుకోతని మిగిల్చింది. ఈస్టర్ సండేరోజున హాలీడే కోసం భార్య పిల్లలో అండర్స్ వచ్చారు. అయితే జరిగిన వరుస పేలుళ్లతో తన ముగ్గురు చిన్నారులు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో గద్గత స్వరంతో రోదిస్తున్నాడు.
ముగ్గురు చిన్నారుల మృతి
నిన్న శ్రీలంకలో చర్చ్, లగ్జరీ హోటళ్ల లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డారు. మొత్తం 8 చోట్ల నరమేధం సృష్టించారు. తన ఫ్యామిలీలో కలిసి అండేర్స్ వెకేషన్ కోసం శ్రీలంక వచ్చారు. భార్య, నలుగురు పిల్లలతో సరదాగా గడుపుదాని వస్తే .. బాంబు పేలుళ్లతో ఇంటి దీపాలు ఆరిపోయాయి. నలుగురు పిల్లల్లో ముగ్గురు పేలుళ్లలో చనిపోయారు. ఈ మేరకు పోల్సెన్ కంపెనీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. కానీ వారి వివరాలు, ఎలా చనిపోయారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు.

బిలియనీర్ .. పోలెన్స్
అండేర్స్ సంస్థ పోలెన్స్ సంస్థ డెన్మార్క్, స్కాట్లాండ్ మంచి పేరుంది. వేరో మోడ, జాక్ అండ్ జాన్స్ అనే బ్లాండ్లను పోలెన్స్ కంపెనీ రూపొందిస్తోంది. దీంతోపాటు ఆన్ లైన్ రిటైలర్ అసోస్తో ఒప్పందం చేసుకొని జలాండోలో విక్రయిస్తుంటారు. స్కాట్లాండ్లో పోలెన్స్ కంపెనీ షేర్ 1 శాతం కంటే ఎక్కువ ఉన్నదని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.












Click it and Unblock the Notifications