విమానం ఢీకొని ముగ్గురు మృతి ,నేపాల్ లో ఘటన
నేపాల్ పర్వత ప్రాంతంలోని లుక్లాలోని తెన్జింగ్ హిల్లరీ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి విమానాశ్రాయంలోని విమానం టేక్ఫ్ ఆవుతుండగా సమ్మిట్ ఎయిర్ కు చెందిన విమానం ఎయిర్ పోర్టు హెలిప్యాడ్ లో నిలిచి ఉన్న రెండు హెలి కాప్టర్ లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
రన్వే పై ఉన్న హెలికాప్టర్లను ఢీ కొట్టిన విమానం
కాగా నేపాల్ కు చెందిన వైమానిక అధికారి తెలిపిన వివరాల ప్రకారం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వే పై నుంచి అదుపుతప్పిన విమానం పక్కనే హెలిప్యాడ్ లో ఉన్న రెండు హెలికాప్టర్ లను ఢీకోట్టిందని చెప్పారు.దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై, రామ్ బహదూర్ , కోపైలటట్ ఢుంగానా అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏఎస్సై బహదూర్ శ్రేష్ట ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడని తెలిపారు ,కాగా విమానంలో ఉన్న పైలట్ తో పాటు హెలికాప్టర్ లోని మరో వ్యక్తి కి గాయాలు కావడంతో వారిని కాఠ్మండ్ లోని ఆసుపత్రికి తరలించారు.

డేంజర్ విమానాశ్రం
కాగా ప్రపంచంలోనే అతి ఎత్తైన విమానాశ్రాయం నేపాలో 2845 మీటర్ల ఎత్తులో అతి చిన్న రన్ వే నిర్మాణం కలిగి ఉంటుంది. ఈనేపథ్యంలోనే దీన్ని కేవలం హెలికాప్టర్లు మరియు ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాప్ట్ ల రాకపోకలను మాత్రమే అనుమతించబడుతుంది. కాగా ఇదే విమానాశ్రయం లో సరైన వెలుతురు లేక 2017 మే ఓ కార్గో విమానం ప్రమాదం గురైంది.దీంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.కాగా ఆదే సంవత్సరం ఫిబ్రవరి లో కూడ వాతవరణ పరిస్థితులు అనుకూలించక నేపాల్ దేశ టూరీజం మినిస్టర్ తో పాటు ఓ హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి చెందారు.కాగా లుక్లా ఎయిర్ పోర్టులో సంఘటన జరగడంతో విమానాల రాకపోకలను నిషేదించారు.












Click it and Unblock the Notifications