వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోరప్రమాదం: ట్రక్కులో 38మంది అమ్మాయిల మృతి
జోహన్నెస్ బర్గ్: ఆఫ్రికాలోని స్వాజిలాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 మంది అమ్మాయిలు, యంగ్ మహిళలు మృతి చెందారు. 44 మంది ఒపెన్ టాప్ ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యలో వాహనాన్ని వేరొక వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరింగిందని అధికారులు తెలిపారు.
ఈ ఘటలనో 38 మంది యువతులు, యంగ్ మహిళలు చనిపోయారు. ఆ దేశ రాజు ఎంస్వతి-3 ముందు ఆడిపాడేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రతి ఏటా జరిగే ఈ సంప్రదాయ వేడుకల్లో ఈ ఏడాది కూడా దేశం నలుమూలల నుంచి యువతులను రాజధానికి తరలిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరో ఇరవై మంది గాయపడ్డారు.
మృతి చెందిన వారు ఓపెన్ ట్రక్లో వెనుక వైపున ప్రయాణిస్తున్నారు. కాగా, తొలుత పోలీసులు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇచ్చారని సమాచారం.
Comments
English summary
At least 38 girls and young women were killed in a crash while travelling to Swaziland's most famous traditional festival, a rights group said on Saturday.
Story first published: Monday, August 31, 2015, 13:47 [IST]