కూలిన సైనిక విమానం: 38 మంది బలి (వీడియో)
మెడాన్: ఇండోనేసియా మిలటరి విమానం భవనాల మీద కుప్పకూలిపోవడంతో 38 మంది మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తియ్యడానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇండోనేసియా మిలటరికి కి చెందిన C-130 హెర్కిలెస్ విమానం మంగళవారం మధ్యాహ్నం బయలుదేరింది. ఇండోనేసియాలోని మెడాన్ నగరంలో తక్కు ఎత్తులో వెళుతూ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. పలు వాహనాలు బూడిద అయ్యాయి. మంటలు వ్యాపించడంతో అనేక మంది మరణించారు. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. విమానం ఎందుకు కూలిపోయింది అని ఆరా తీస్తున్నారు.
విమానంలో ముగ్గురు పైలెట్లు, ఒక నేవిగేటర్, 8 మంది టెక్నీషియన్లు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న వారు ఎవరైనా బ్రతికారా అని ఆరా తీస్తున్నారు. అయితే భవనాలలో ఎంత మంది ఉన్నారు, వారిలో ఎంత మంది మరణించారు అని ఆరా తీస్తున్నారు.
విమానం కూలిపోవడంతో ఆ పరిసర ప్రాంతాలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అనేక భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications