ఉగ్రదాడి: బాంబుల అంబులెన్స్ పేలి 95 మంది మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబులతో నిండిన అంబులెన్స్ పేలడంతో 95 మంది మరణించగా, 158 మంది దాకా గాయపడ్డారు.
రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆ పేలుడు సంభవించింది.తాలిబన్ ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు చెక్ పాయింట్ వద్ద అంబులెన్స్ పేలిపోయింది.

భారీ శబ్దంతో అంబులెన్స్ పేలిపోయింది. సమీపంలోని భవనాల కిటికీలు కదిలాయి. పెద్ద యెత్తున పొగ లేచిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
అంబులెన్స్ పేలిన స్థలం ఆంతరింగిక మంత్రిత్వ శాఖ, ఐరోపా యూనియన్,హై పీస్ కౌన్సిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలుడు సంభవించిందని ఆంతరంగిక ంత్రిత్వ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి నస్రత్ రహిమీ చెప్పారు.












Click it and Unblock the Notifications