బాగ్దాద్లో ఐఎస్ మారణహోమం: 43మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మారణహోమం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఐఎస్ జరిపిన బాంబు దాడుల్లో సుమారు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
బాగ్దాద్లోని ఓ వాణిజ్య సముదాయం ముందు ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి.. 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరికొందరు ఉగ్రవాదులు వాణిజ్య సముదాయంలో దాక్కోవడంతో భద్రతా బలగాలు భవనం పైనుంచి లోపలికి ప్రవేశించి ముష్కరులను కట్టడి చేశాయి.

ఈ ప్రయత్నంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు పోలీసులకు పట్టుబట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ప్రకటించింది. తొలుత ఈ వాణిజ్య భవనంలో 50 మందిని బందీలుగా ఉంచారని పోలీసులు భావించారు.
అందులోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ బందీలుగా లేరని గుర్తించారు. మరో ఘటనలో ఆగ్నేయ బాగ్దాద్లోని రద్దీగా ఉండే మార్కెట్లో కారు బాంబు పేల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఘటనలో హోటల్వద్ద బాంబు దాడికి పాల్పడటంతో సుమారు 20 మంది మృతిచెందినట్లు అక్కి అధికారులు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications