బంగ్లాలో మరోసారి పేలుళ్లు: పోలీస్తోపాటు 4గురు మృతి
ఢాకా: దేశమంతా రంజాన్ పర్వదినం జరుపుకుంటుండగా ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో మరోసారి పేలుళ్లకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 100కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ ప్రాంతంలో గురువారం ఉదయం ప్రార్థనలు చేసుకుంటుండగా ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
పోలీసు కాన్వాయ్ లక్ష్యంగా బాంబులు వేసినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఓ పోలీసు అధికారితోపాటు ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది పౌరులు తీవ్ర గాయాలపాలయ్యారు.
కాగా, ఈ దాడి జరిగిన సమయంలో ఈద్గా మైదానంలో దాదాపు 3 లక్షల మంది ప్రార్ధనలు చేస్తున్నారు. దాడి జరిపిన అనంతరం ఆగంతకులు అక్కడే ఉన్న ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పేలుడు ఘటనను బంగ్లాదేశ్ సమాచారశాఖ మంత్రి హసనుల్హక్ ధ్రువీకరించారు. కిషోర్గంజ్లో ముష్కరులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

ఘటనపై సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై బంగ్లా ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
కాగా, గత శుక్రవారం కూడా ఢాకాలోని ప్రఖ్యాత హోలీ ఆర్టిసన్ కేఫ్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ భారత యువతీతోపాటు 20మందిని ఉగ్రవాదులు గొంతుకోసి దారుణంగా హతమార్చారు. మరో ఇద్దరు పోలీసులు కూడా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications