ఇండోనేషియాలో బలమైన భూకంపం: 6.1గా తీవ్రత నమోదు, పరుగులు తీసిన జనం
జకార్తా: ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. పశ్చిమ ఇండోనేషియాలోని నియాస్ రీజియన్, సుమత్రా ద్వీపంలో సోమవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది భయాందోళనలకు గురైన నివాసితుల ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం భవనాలను వణికించినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
భూకంప కేంద్రం ఉత్తర సుమత్రాలోని పడంగ్సిడెంపువాన్ నగరానికి నైరుతి దిశలో 84 కిలోమీటర్ల (52 మైళ్లు) లోతులో సముద్రంలో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. ఈ భూకంపం సోమవారం రాత్రి 9:59 (1459 GMT) సమయంలో జరిగింది.

భూ ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు ఏమీ లేవని, అయితే భూకంప కేంద్రానికి సమీపంలోని నివాసితులకు సంభావ్య అనంతర ప్రకంపనల గురించి జాగ్రత్త వహించాలని దేశ వాతావరణ శాస్త్రం, జియోఫిజిక్స్ ఏజెన్సీ అప్రమత్తం చేసింది.
ప్రధాన ఇండోనేషియా మీడియా సంస్థలు కూడా ఆస్తి నష్టం లేదా గాయాల గురించి తక్షణ నివేదికలను అందించలేదు. కానీ, కొంతమంది నివాసితులు తమ ఇళ్లు కంపించినట్లు తెలిపారు.
"భూకంపం చాలా బలంగా ఉంది. ఇది సాధారణమైన వాటిలా కాదు. ఈసారి మా ఇల్లు బలంగా కంపించింది. అని స్థానికులు తెలిపారు. కాగా, పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" స్థానం కారణంగా తరచుగా ఇండోనేషియాలో భూకంపాలు సంభవిస్తాయి. అగ్ని పర్వతాలు కూడా ఇక్కడ తరచూ పేలుతుంటాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications