జపాన్లో శక్తివంతమైన భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు: జనం పరుగులు
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోను ప్రకంపనలు వచ్చాయి. శనివారం ఉదయం 7.8 తీవ్రతలో భూమి కంపించింది. భవనాలు, ఇళ్లు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక నిమిషంపాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దక్షిణ జపాన్కు 870 కిలో మీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 670 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూకంపం నేపథ్యంలో టోక్యోలోని నరితా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రన్వేలను మూసివేశారు. రైల్వే వ్యవస్థను కూడా కాసేపు ఆపేశారు. 2011మార్చిలో జపాన్లో వచ్చిన భూకంపం సృష్టించిన విధ్వంసం, మిగిల్చిన ప్రాణ నష్టం మిగిల్చింది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న కంపానికి కూడా జపనీయులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. అటు జపాన్ దక్షిణ భాగంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఇది లావాను వెదజల్లుతుండటంతో స్థానికులను అక్కడినుంచి తరలించారు. మరోవైపు జపాన్ భూకంపం ప్రభావం ఢిల్లీలోనూ కనిపించింది. శనివారం సాయంత్రం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించటంతో జనాలు అపార్ట్మెంట్ల్ల్లలోనుంచి బయటకు వచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications