Blast: ఇటలీలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్లు..
ఉత్తర ఇటలీలోని మిలన్ మధ్యలో గురువారం పేలుడు సంభవించింది. పేలుడులో ఒక్కరు గాయపడినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పేలుడు దాడికి అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. కార్లు అగ్నికి కాలిపోయాయి. ఈ పేలుడులో ఎవరు మరణించలేదు.
ఆక్సిజన్ గ్యాస్ డబ్బాలను రవాణా చేస్తున్న వ్యాన్లో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు ఇటాలియన్ మీడియా తెలిపింది. మిలన్ సిటీలో పార్క్ చేసిన వ్యాన్లో పేలుడు సంభవించిందని స్కైటిజి 24 న్యూస్ ఛానెల్ వీడియో ప్రసారం చేసింది.

వీడియోలో దట్టమైన పొగలు కనపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పేందుకు ప్రయత్నించారు.వాహనాలు పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుపోవడంతో..ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ వ్యాపించింది. సంఘటనా స్థలంలోనే పాఠశాల, ఆస్పత్రి ఉంది.
పాఠశాల, ఆస్పత్రిలోని వారిని ఖాలీ చేయించారు. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని ఆయన తెలిపారు.మంటలు సమీపంలోని భవనానికి వ్యాపించాయని, దానిని తొలగించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
"లా రిపబ్లికా, మిలన్లోని పోర్టా రొమానా ప్రాంతంలో వాసరి ద్వారా మూలలో పీర్ లొంబార్డో మీదుగా ఒక వాహనం పేలింది, డొమినో పేలుళ్లను ప్రేరేపించింది, వీటిలో కొన్ని మోపెడ్లతో పాటు కనీసం ఐదు వాహనాలు కూడా ఉన్నాయి" అని ఇటాలియన్ దినపత్రిక తెలిపింది. "ఆక్సిజన్ ట్యాంక్లను తీసుకువెళ్లే ట్రక్కు వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చు" అని దినపత్రిక నివేదించింది.












Click it and Unblock the Notifications