శవంపై అత్యచారం... సమాధి వద్ద దారుణం..!
కామాంధులు చనిపోయిన మహిళ శవాన్ని కూడ వదిలిపెట్టలేదు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసీ కొంతమంది దుండగులు దానిపై అత్యాచారం చేసిన దారుణ సంఘటన వెలుగు చూసింది. గత శనివారం జరిగిన ఈ సంఘటన పాకిస్తాన్ కరాచీలోని లోడి పట్టణంలోని స్మశాన వాటికలో చోటుచేసుకుంది. శనివారం నాడు స్థానిక ఇస్మాయిల్ గోత్ స్మశాన వాటికలో ఓ మహిళ మహిళ మృతి చెందడంతో సమాధి చేశారు.
అయితే మరుసరి రోజు స్మశానవాటికకు వెళ్లిన కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. మహిళను పూడ్చిపెట్టిన సమాది తవ్వి ఉండడంతో దిగ్భాంత్రి గురి అయ్యారు. శ్మశాన వాటిక పేటికలో ఉండాల్సిన మట్టి తవ్వి ఉంది. దీంతో అనుమానంతో మృతదేహాన్ని పరీశీలించగా మృతదేహంపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు. అయితే శ్మశాన వాటికలో కాపాదారును నిలదీశారు.
దీంతో కాపాదారుడు పొంతన లేని సమాధానం చెప్పాడు. ముందుగా కుక్క శవాన్ని బయటకు తీశాడని చెప్పాడు. అయితే సమాధిపై పెద్ద బండరాయి పెట్టి ఉంటే కుక్క ఎలా తీస్తుందని ప్రశ్నించారు. దీంతో ఏదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో కాపలాదారుడు పారిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఎలాంటీ కేసును నమోదు చేయలేదని తెలుస్తోంది.