ఉగ్రవాదులతో చేతులు కలిపిన సైనికులు
కాబూల్: ఉగ్రవాదులతో పోరాటం చేసి మాతృదేశాన్ని కాపాడుకుని దేశభక్తిని చాటుకోవలసిన సైనికులు ప్లేటు పిరాయించారు. పోరాటం చేస్తున్న సైనికులు ఏకంగా ఉగ్రవాదుల దగ్గర తలవంచి వారికి తొత్తులుగా మారిపోయారు.
అఫ్ఘనిస్థాన్ లో ఈ సంఘటన జరిగింది. తమ సైన్యంలోని 125 మంది రక్షణా సిబ్బంది తాలిబన్లతో కలిసిపోయారని అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. అఫ్టనిస్థాన్ లోని త్రిగరన్ లోయలో తాలిబన్లతో సైన్యం పోరాటం చేస్తున్నది.
గత నాలుగు రోజుల నుండి సైనికులు తాలిబన్ల మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఒక్క సారిగా సీన్ రివర్స్ అయ్యింది. యుద్దం చేస్తున్న సైనికులు తాలిబన్లతో కలిసిపోయారు. విషయం తెలుసున్న అధికారులు షాక్ కు గురైనారు.
త్రిగరన్ లోయలో జరుగుతున్న యుద్దంలో 20 మంది తాలిబన్ ఉగ్రవాదులు, 10 మంది సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సైనికులు తాలిబన్లతో చేరిపోవడంతో త్రిగరన్ లోయ వారి ఆధీనంలోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.