టీ20 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో భారీ పేలుడు: ఉద్రిక్తత, పరుగులు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. ష్పగీజా క్రికెట్ లీగ్ టీ20 సందర్భంగా కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆత్మాహుతి పేలుడు జరిగింది. ఆటగాళ్లందరూ సురక్షితంగా ఉన్నారు. వెంటనే వారందరినీ బంకర్లోకి తరలించారు. అయితే, వీక్షకులు ఎవరైనా మరణించారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
Footage : There have been casualties in the blast at the Kabul international cricket stadium. #Afghanistan pic.twitter.com/wM7qMsVDpR
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) July 29, 2022
బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ వర్సెస్ పామిర్ జల్మీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగినప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు స్టేడియంలో ఉన్నారు. కాగా, పేలుడు తర్వాత గందరగోళం ఏర్పడడంతో భయాందోళనలకు గురైన వీక్షకులంతా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
ష్పగీజా క్రికెట్ లీగ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్లో నిర్వహించే ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్. Shpageeza టోర్నమెంట్ ఎనిమిది ఫ్రాంచైజీలతో ప్రారంభించబడింది. ఇందులో జాతీయ జట్టు, విదేశీ ఆటగాళ్లు, 'A' జట్టు ఆటగాళ్లు, అండర్ 19 జట్టులోని ఆటగాళ్లతో పాటు సంబంధిత ప్రాంతాల నుంచి ఎలైట్ ప్రదర్శనకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు.
అదనంగా, ACB అన్ని జట్టుకు ఫ్రాంఛైజ్ చేయడం ద్వారా లీగ్కు గుర్తింపును ఇచ్చింది. అయితే ప్రతి జట్టుకు డ్రాఫ్ట్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.
Bomb Blast in Kabul cricket stadium in Afghanistan. pic.twitter.com/Vu9kGzbUod
— Akash Kharade (@cricaakash) July 29, 2022
"ష్పగీజా లీగ్లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది, మ్యాచ్ సమయంలో, ఒక పేలుడు జరిగింది; గుంపులో ఉన్న నలుగురు పౌరులు గాయపడ్డారు," ఏసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నాసిబ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాబూల్లోని గురుద్వారా కార్తే పర్వాన్ గేట్ సమీపంలో పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత ఈ పేలుడు సంభవించింది.