భారత్లో దాడులు చేస్తాం.. ఈ నగరాల్లోనే.. అల్ ఖైదా వార్నింగ్
మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతల నోటి దురుసు అరబ్ దేశాల ఆగ్రహానికి గురయ్యాయి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగానూ ప్రకంపనలు రేపాయి. ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించగా, తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా స్పందించింది.
అంతేకాదు దాడులు చేస్తామని బెదిరింపులకు దిగింది. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేపడతామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసమే ఈ దాడులు చేస్తామని అని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ విడుదల చేసింది. ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం అని స్పష్టంచేసింది.

మా శరీరాలకు, మా పిల్లల దేహాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి అని లేఖలో పేర్కొన్నారు. అల్ ఖైదా కామెంట్లతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కశీర్.. ఇతర నోట్ల అలజడి నెలకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications