టాయిలెట్ పేపర్లపై ట్రంప్ ట్వీట్లు, అమ్మకానికి పెట్టిన అమెజాన్
అమెజాన్ మరోసారి వివాదానికి తెరతీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ట్వీట్లను టాయిలెట్ పేపర్లపై ముద్రించి వివాదం సృష్టించింది.
వాషింగ్టన్: అమెజాన్ మరోసారి వివాదానికి తెరతీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ట్వీట్లను టాయిలెట్ పేపర్లపై ముద్రించి వివాదం సృష్టించింది.
ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వస్తువుల మీద, దేవుళ్ళ చిత్రపటాలు, జాతీయ జెండా ముద్రించి వివాదాల్లోకెక్కిన ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్ మరోసారి వివాదానికి తెరతీసింది.
ట్రంప్ వివాదాస్పద ట్వీట్లను అమెజాన్ టాయిలెట్ పేపర్లపై ముద్రించింది. వాటిపై ట్రంప్ ముఖం కూడ ఉంది. ప్రస్తుతం ఈ ట్రంప్ టాయిలెట్ పేపర్లు హట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
శుక్రవారంనాటికే ట్రంప్ టాయిలెట్ పేపర్లు అయిపోయాయి. మరిన్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సింగిల్ రోల్ ధర 9.99 డాలర్లు. దీనిపై సామాజిక మాధ్యమాల్యలో తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది.
అగ్రరాజ్య దేశాధ్యక్షుడు అని కూడ ట్రంప్కు విలువ ఇవ్వరా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ట్రంప్ ముఖచిత్రం ఉన్న టాయిలెట్ రోల్ స్టాకర్ను కూడ అమెజానత్ ఉత్పత్తులుగా పెట్టింది.
దీనిపై ఇంతవరకు అమెజాన్ స్పందించలేదు. వాటిని వెబ్సైట్ నుండి తొలగిస్తోందో లేదో ఇంకా తెలియలేదు. గతంలో కూడ ఇదే తరహలో అమెజాన్ వ్యవహరించింది.