భారత్ కు బిగ్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్, అమెరికా..? ఆ నరరూప రాక్షసుడికి అమెరికా ఘన స్వాగతం..!

భారత్ కు అమెరికా, పాకిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను అమెరికా 250వ ఆర్మీ పరేడ్ కు ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. జూన్ 14 న జరగనున్న ఈ ఆర్మీ పరేడ్ లో అసిమ్ మునీర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 200 మందికిపైగా ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది.

Asim Munir to Attend U S Army s 250th Anniversary Amid India-Pakistan Strains

అయితే మే 8 అర్ధరాత్రి నుంచి 11 వరకు సాగిన ఆపరేషన్ సిందూర్.. ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన ద్వారా నిలిచిపోయింది. పాక్ ఏమైనా తోక జాడిస్తే.. మరోసారి దాడులు చేస్తామని భారత్ హెచ్చరించింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ ల మధ్య సంధి.. తానే కుదిర్చానని అణు యుద్ధాన్ని ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ తిరిగారు. ఆయన ఏ దేశంలో పర్యటించినా.. లేదా ఏ దేశాధిపతులు అమెరికా గడప తొక్కినా ఇదే విషయం ప్రస్తావిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో ట్రంప్ వైఖరిని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చాలా సార్లు ప్రపంచ దేశాల వేదికగా ఖండించారు. ట్రంప్ జోక్యం లేదని.. పాకిస్థాన్ ప్రాధేయపడితే కనికరించి వదిలేశామని జై శంకర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భారత్ పై అక్కసు వెల్లగక్కుతూ వచ్చింది అమెరికా. ఇటీవల యాపిల్ ఐ ఫోన్ తయారీ పరిశ్రమను సైతం భారత్ కు రాకుండా ట్రంప్ కాళ్లు అడ్డం పెట్టారు. యాపిల్ సంస్థకు అమెరికా రాయితీలు ఇస్తుందని ప్లాంట్స్ ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యారు ట్రంప్.

ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని తన వక్రబుద్దిని చాటుకుంది అమెరికా. పాకిస్థాన్ లోని నరహంతకుడు, పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు అమెరికా ఆహ్వానం పంపినట్లు సమాచారం. జూన్ 14న అమెరికాలో జరగనున్న 250వ ఆర్మీ పరేడ్ దినోత్సవానికి అసిమ్ మునీర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అమెరికా ఆర్మీ 1775, జూన్ 14న ఏర్పడింది. ఈ సందర్భంగా జూన్ 14న 250వ ఆర్మీ పరేడ్ నిర్వహించనుంది అమెరికా సర్కార్. అయితే ఈ పరేడ్ కు అన్ని దేశాల ఆర్మీ చీఫ్ లను ఆహ్వానించాలని అమెరికా భావించిందట. కానీ భారత ఆర్మీ చీఫ్ కు మాత్రం ఇంతవరకూ ఆహ్వానం రాకపోవడం గమనార్హం. ఇక మరోవైపు అసిమ్ మునీర్ ను అమెరికా ఆహ్వానించడంపై పాకిస్థాన్ లోని పీటీఐ పార్టీ ఆందోళనలు చేపట్టింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+