ఆప్ఘాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు: 12 మంది మృతి, 30 మందికిపైగా గాయాలు
కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది గాయపడ్డారు. కాబూల్లోని ఓ మసీదు దగ్గర ఈ పేలుడు సంభవించింది. జనసమ్మర్థం ఎక్కువగా ఉండటంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ పేలుడుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆప్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్ట్లీ తెలిపారు. కాబూల్లోని ఈద్ గహ్ మసీదు దగ్గర ఈ పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు.

తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అమ్మ స్మారక సభ జరుగుతోన్న మసీదు లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగినట్లు వెల్లడించారు. మరో మంత్రి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఈ పేలుడు కారణంగా చాలా మంది మరణించారని తెలిపారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Recommended Video
ఇప్పటి వరకు ఈ పేలుడుకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యతను ప్రకటించలేదు. కాగా, ఆప్ఘానిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. తాలిబన్లకు శత్రువులుగా భావించే వీరి ప్రాబల్యం నంగర్హార్ తూర్పు ప్రావిన్సులో అధికంగా ఉంది. జలాలాబాద్లోనూ ఇది వరకు హత్యలు, దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications