ఘోర పడవ ప్రమాదం: ముగ్గురు చిన్నారులతోపాటు 32 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం పడవ మునిగిపోవడంతో ముగ్గురు చిన్నారులతోపాటు 32 మంది మరణించారు. ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9.15 గంటలకు ఎంఎల్ మార్నింగ్ బర్డ్ అనే పడవ మునిగిపోయింది.
ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని గాయాలతో బయటపడిన బాధితులు తెలిపారు. ఎంఎల్ మార్నింగ్ బర్డ్ మరొక పడవ మోయూర్-2ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని వల్ల నీరు పడవలోకి చేరుకుందని ఢాకా ట్రిబ్యూన్ అగ్నిమాపక సేవా ప్రధాన కార్యాలయం అధికారి రోజినా అక్తర్ వెల్లడించారు.

ప్రమాదానికి గురైన పడవ సామర్థ్యం 45 మందే అయినప్పటికీ మరికొంత మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. వేరొక పడవను బలంగా ఢీకొట్టడంతో నీటిలో మునిగిపోయిందని కమాండర్ గోలం సాడేక్ వెల్లడించారు.
మృతదేహాలను బయటికి తీశామని, ఇప్పుడు పడవను బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications