పాకిస్తాన్ లో అమానుషం- నవదంపతులపై కిరాతకం
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువ జంటను అత్యంత దారుణంగా హత్య చేసిన దృశ్యాలు ఉన్నాయి. ఆ జంట తమ కుటుంబాలను ఎదిరించి వివాహం చేసుకున్నారని సమాచారం. వారిని బానో బీబీ, ఎహసానుల్లాగా గుర్తించారు.
బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా శివారు ప్రాంతంలో గల నిర్జన ప్రదేశానికి కొందరు వ్యక్తులు ఎస్ యూవీ, పికప్ ట్రక్కుల్లో రావడం, ఆ జంటను వాహనాల నుండి బయటకి లాగడం, తలపై శాలువా కప్పుకొని ఉన్న యువతికి ఖురాన్ కాపీని అందించడం ఈ వీడియోలో రికార్డయింది.

ఖురాన్ ను పట్టుకుని ఎదురుగా ఉన్న ఓ గుట్ట వైపు వెళ్తోన్న సమయంలో ఆమె బ్రాహ్వి భాషలో ఓ యువకుడితో మాట్లాడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నాతో ఏడు అడుగులు నడువు, ఆ తర్వాత వాళ్లు నన్ను కాల్చి చంపవచ్చు అనేది ఆ మాటల సారాంశం. ఆ మాటలు విన్న తరువాత ఆ యువకుడు కొంత దూరం ఆమెతో కలిసి నడవడం ఇందులో చూడొచ్చు.
ఆ కొద్దిసేపటికి ఆ యువతి.. నన్ను కాల్చడానికి మాత్రమే నీకు అనుమతి ఉంది.. తమను తీసుకొచ్చిన వారిని ఉద్దేశించి చెప్పారు. ఆ వెంటనే.. ఆ గుంపులో ఒకరు- ఆమె వీపుపై తుపాకీ గురిపెట్టి కాల్చాడు. బానో బీబీపై ఏడురౌండ్లు, ఎహసాన్ పై తొమ్మిది రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. బుల్లెట్ తగిలిన వెంటనే ఆ యువతి నేలపై కుప్పకూలిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
మే నెలలో చోటు చేసుకున్న ఘటనగా పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. బక్రీద్ పండగకు మూడు రోజుల ముందు జరిగిందనట్లు తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాకిస్తాన్ సహా ఇతర దేశాల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనపై వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించాలని, హతురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఊపందుకుంది. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతులను ఉల్లంఘించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే నేరాలకు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని వారు కోరుతున్నారు.
స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ జంటను బానో బీబీ, ఎహసానుల్లా గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 13 మంది అనుమానితులను అరెస్టు చేశారు. కటుంబ పెద్దల అనుమతి లేకుండా బానో బీబీ.. ఎహసానుల్లాను వివాహం చేసుకుందని ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో, ఆ జంటను హత్య చేయాలని స్థానిక ముస్లిం మతపెద్దలు నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన 13 మందిలో ఆ ముస్లిం మత పెద్దతో పాటు బానో బీబీ సోదరుడు కూడా ఉన్నారని పోలీసు అధికారి నవీద్ అఖ్తర్ తెలిపారు. ఈ దారుణ ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులపై వీరందరిపై విచారణ జరిపి శిక్షిస్తామని తెలిపారు.
పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం (HRCP) గణాంకాల ప్రకారం, దేశంలో 2024లో కనీసం 405 పరువు హత్యలు జరిగాయి. చాలా కేసులు వెలుగులోకి రాకపోవడంతో వాస్తవ సంఖ్య దీని కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications