జర్నలిస్టుల బహిష్కరణ: ఇండియాకు చైనా మీడియా బెదరింపు
న్యూఢిల్లీ/బీజింగ్: తమ దేశం నుంచి చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది.
భారతీయులకు తమ దేశ వీసాలు ఇవ్వడం చైనా మరింత కష్టతరం చేసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల చైనాలో ఉంటున్న భారత జర్నలిస్టులపై ప్రభావం పడుతుందని కూడా వ్యాఖ్యానించింది.
చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తమకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవని చైనా జాతీయ టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ ఆదివారం హెచ్చరించింది.

హద్దులు దాటినందుకే బహిష్కరణ: భారత్
చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను భారత్లో ఉండటానికి అనుమతి నిరాకరించడానికి కారణం వారు అధికారిక విధులను మీరి కార్యకలాపాలను చేపట్టడమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ వార్తా సంస్థకు చెందిన ఢిల్లీ బ్యూరో అధిపతి వు క్వియాంగ్, ముంబై జర్నలిస్టులు టాంగ్లు, మా క్వియాంగ్లను భద్రతా సంస్థలు కొన్ని నెలలుగా పరిశీలిస్తున్నాయని తెలిపాయి. వారి వీసాల గడువు జనవరిలో ముగిసింది.
అప్పటినుంచి వాటిని పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరో పొడిగింపు ఇవ్వకపోవడం వల్ల జులై 31 కల్లా వారు భారత్ను వీడాల్సి ఉంటుంది. ఈ ముగ్గురి స్థానంలో వేరేవారిని పంపే స్వేచ్ఛ చైనాకు ఉందని ఆవర్గాలు తెలిపాయి. అణుసరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుకోవడానికి ఈఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications