వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌లో భారీ పేలుడు: 50కి చేరిన మృతుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

శిఖర్పూర్: పాకిస్థాన్‌లోని శిఖర్పూర్ జిల్లాలోని లఖిదార్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో సుమారు 50 మంది మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతం కరాచీ రాజధాని సింద్‌కు 511 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Blast at Shikarpur Imambargah kills 17, injures 40

శుక్రవారం ఇమామ్ బర్గా మోల కరబాల వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న సమయలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

శిఖర్పూర్ పరిసరాల ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ముత్తహిదా కయామి మూవ్‌మెంట్ అధిపతి అల్తాఫ్ హుస్సేన్, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పేలుడు ఘటనను ఖండించారు. పెషావర్ స్కూల్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు సుమారు 150 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనను మరవకముందే ఈ ఘటన చోటుసుకోవడం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

English summary
At least 17 people were killed and 40 others were injured Friday in a blast at an Imambargah in Lakhidar area of Shikarpur District, 511 kilometres from the Sindh capital of Karachi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X