ఐరాస బస్సుపై బాంబు దాడి: 6గురు మృతి, తమ పనేనన్న ఆల్ షబాబ్
మొగదిషు: ఐక్యరాజ్యసమితికి చెందిన బస్సుపై ఉగ్రవాదులు బాంబు దాడి చేయడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన సోమాలియాలోని గారోవి పట్టణంలో చోటు చేసుకుంది. కాగా, దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఆల్ షబాబ్ పేర్కొంది.
బాంబు దాడిలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈశాన్య సోమాలియాలోని పుట్లాండ్ సమీపంలో చోటు చేసుకుందని సిఎన్ఎన్ వెల్లడించింది. ఆల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ బాంబు దాడికి బాధ్యత తీసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ బాంబు దాడి తమ పనేనని ఆల్ షబాబ్ అధికార ప్రతినిధి అబ్దియాజిజ్ అబూ ముసబ్ పేర్కొన్నారు. కాగా, సోమాలియాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నిక్ కే ఈ బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు.
ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఆల్ షబాబ్.. సోమాలియాలో దాడులకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తోంది. కెన్యాలోని గర్రిసా యూనివర్సిటీ కాలేజీలో ఇటీవల జరిపిన దాడుల్లో సుమారు 150 మంది మృతి చెందారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications