వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరాస బస్సుపై బాంబు దాడి: 6గురు మృతి, తమ పనేనన్న ఆల్ షబాబ్

|
Google Oneindia TeluguNews

మొగదిషు: ఐక్యరాజ్యసమితికి చెందిన బస్సుపై ఉగ్రవాదులు బాంబు దాడి చేయడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన సోమాలియాలోని గారోవి పట్టణంలో చోటు చేసుకుంది. కాగా, దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఆల్ షబాబ్ పేర్కొంది.

బాంబు దాడిలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈశాన్య సోమాలియాలోని పుట్లాండ్ సమీపంలో చోటు చేసుకుందని సిఎన్ఎన్ వెల్లడించింది. ఆల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ బాంబు దాడికి బాధ్యత తీసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

 Bomb blast on UN bus kills six in Somalia, Al-Shabab claims responsibility

ఈ బాంబు దాడి తమ పనేనని ఆల్ షబాబ్ అధికార ప్రతినిధి అబ్దియాజిజ్ అబూ ముసబ్ పేర్కొన్నారు. కాగా, సోమాలియాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నిక్ కే ఈ బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు.

ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఆల్ షబాబ్.. సోమాలియాలో దాడులకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తోంది. కెన్యాలోని గర్రిసా యూనివర్సిటీ కాలేజీలో ఇటీవల జరిపిన దాడుల్లో సుమారు 150 మంది మృతి చెందారు.

English summary
At least six people were killed on Monday when a bomb went off in Somalia's Garowe town, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X