ఇమ్మిగ్రేషన్ విసాలను నిలిపివేసిన బ్రిటన్: విదేశీ విద్యార్థులపైన కఠిన ఆంక్షలు: రిషి సునాక్ సంచలనం
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంది. సరికొత్త విసా పాలసీలను ప్రకటించింది. అనేక విప్లవాత్మక సవరణలను చేసింది ఇందులో. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో స్వదేశీయులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. విసా విధానాల్లో తీసుకొచ్చిన మార్పులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయనీ తెలిపింది.
ఇందులో భాగంగా- ఇమ్మిగ్రేషన్ విసా (UK immigration visa)లను నిలిపివేసింది బ్రిటన్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) స్వయంగా వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య చాలా అధికంగా ఉంటోందని, దీన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

అదే సమయంలో స్కిల్డ్ వర్కర్స్ మంజూరు చేస్తోన్న కనీస వేతనాన్ని భారీగా పెంచింది బ్రిటన్ ప్రభుత్వం. వారి కనీస వేతనాన్ని 20 శాతానికి పెంచింది. అంటే- ఇప్పుడు పని చేస్తోన్న స్కిల్డ్ వర్కర్లకు ఇస్తోన్న కనీస వేతనం మొత్తానికి 20 శాతాన్ని అధికంగా చేర్చాల్సి ఉంటుంది ఆయా సంస్థల యాజమాన్యానికి.
2022లో బ్రిటన్ ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 7,45,000. ఆ దేశ చరిత్రలో ఇదే అత్యధికం. ఈ సంఖ్యను మూడు లక్షల కంటే దిగువకు తీసుకుని రావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆ దేశ హోం మంత్రి జేమ్స్ క్లెవెర్లీ తెలిపారు. దీనికోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పలేదని వ్యాఖ్యానించారు.
Immigration is too high.
— Rishi Sunak (@RishiSunak) December 4, 2023
Today we’re taking radical action to bring it down.
These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY
గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బ్రిటన్కు పెద్ద సంఖ్యలో వలసదారులు తరలి వచ్చేవారు. ఈ మధ్యకాంలో భారత్, నైజీరియా, చైనా నుంచి వచ్చే వారి సంఖ్య భారీగా ఉంటోంది. గత ఏడాది జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల్లో ఈ మూడు దేశాల వారే అధికంగా ఉన్నారు.
We've just announced the biggest ever cut in net migration.
— Rishi Sunak (@RishiSunak) December 4, 2023
No Prime Minister has done this before in history.
But the level of net migration is too high and it has to change. I am determined to do it.
బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న విదేశీ విద్యార్థులపైనా రిషి సునాక్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. విదేశీ విద్యార్థులు తమ కుటుంబాలను బ్రిటన్కు తీసుకుని రావడంపై నిషేధాన్ని ప్రకటించింది. రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఇచ్చింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications