బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు: గణతంత్ర వేడుకలకు అతిథి లేనట్లేనా?
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బ్రిటన్లో కరోనా స్టెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు బోరిస్ జాన్సన్.. భారత గణతంత్ర దినోత్సవ వేడులకు భారత్ రావడానికి డిసెంబర్ నెలలో అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, స్టెయిన్ కరోనా కలవరపరుస్తున్న నేపథ్యంలో భారత్ పర్యటనకు రాలేని బోరిస్ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. 1993లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు అప్పటి ప్రధాని జాన్ మేజర్ హాజరయ్యారు. కరోనా స్ట్రెయిన్ కలకలం లేకుంటే ఈ ఏడాది బోరిస్ జాన్సన్ కూడా హాజరయ్యేవారు.












Click it and Unblock the Notifications