సింధు నది నీటిని పాకిస్తాన్ కు వెళ్లకుండా ఆపలేమా ? అసలు కారణాలివే..!

కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిన్న సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కీలకమైనది పాకిస్తాన్ తో ప్రస్తుతం అమల్లో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేత. ఈ ఒప్పందం అమలు నిలిపేస్తే పాకిస్తాన్ నీరు అందక అల్లాడుతుందంటూ వార్తలొచ్చాయి. అయితే క్షేత్రస్ధాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి.

పాకిస్తాన్ తో ఎప్పుడో 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపేసింది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం నిర్ణయం కారణంగా పాకిస్తాన్ రాత్రికి రాత్రే ఇబ్బంది పడే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూస్తే సింధు నది నీరు ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.

can t we stop indus river water to Pakistan completely here are key reasons

నదులను పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి మన దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు లేవు. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ కు వెళ్లే నీటి ప్రవాహాన్ని 5 శాతం నుంచి 10 శాతం మాత్రమే తగ్గించగలదని నిపుణులు చెప్తున్నారు. గతంలో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం
భారతదేశాన్ని సింధు, జీలం, చీనాబ్‌లపై "రన్-ఆఫ్-ది-రివర్" జలవిద్యుత్ ప్రాజెక్టులకు మాత్రమే అనుమతించారు. అంటే నీటి నిల్వ లేదా అడ్డంకులు ఉండవు. కానీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్ కు నీటి సరఫరాను భారీగా తగ్గించేలా భవిష్యత్తులో చేపట్టే రిజర్వాయర్ ఆనకట్టలకు మార్గం సుగమం చేస్తుంది.

అంటే దీర్ఘకాలంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్ పై పడుతుందన్న మాట. అలాగే పర్యావరణ, ఆర్థిక, దౌత్యపరమైన అడ్డంకులను పరిగణనలోకి తీసుకుంటే భారత్ ఇలాంటి ప్రాజెక్టుకు కట్టడానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్‌కు ఉన్న చిక్కులు కూడా ఎక్కువే. సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్‌లో కాకుండా భారతదేశంలోనే ఉద్భవించాయి కాబట్టి ఆ దేశం ఈ ఒప్పందంపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ నదుల నుండి దాని మొత్తం నీటి సరఫరాలో 80 శాతం పొందుతోంది.

can t we stop indus river water to Pakistan completely here are key reasons

ఈ నీరు వ్యవసాయం, నీటిపారుదలకి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పంజాబ్, సింధ్‌లలో నీరు చాలా ముఖ్యం. పాకిస్తాన్ ఆహారంలో కేవలం పంజాబ్ రాష్ట్రం 85 శాతం ఉత్పత్తి చేస్తుంది. పాకిస్తాన్ వ్యవసాయ జీడీపీకి దాదాపు 25 శాతం పనికొచ్చే, అలాగే 70 శాతం గ్రామీణ జనాభాకు ఏకైక ఆదాయ వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఈ వాటాలు ఎక్కువే. పాకిస్తాన్ లో ఇప్పటికే భూగర్భ జల మట్టాలు క్షీణిస్తున్నాయి.

అలాగే కరాచీ వంటి ప్రధాన నగరాలు ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. నది ప్రవాహంలో స్వల్ప అంతరాయం కూడా పంట దిగుబడిని దెబ్బతీస్తుంది. ఆహార భద్రతను మరింత దిగజారుస్తుంది. అలాగే ఆర్థిక అస్థిరతను రేకెత్తిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్ కు సమస్యలు తప్పవని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+