పేలిన అగ్నిపర్వతం: చోటా రాజన్ తరలింపు ఆలస్యం
బాలి: ఇండోనేషియాలోని బాలీలో పట్టుబడిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్ భారత తరలింపు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీ సమీపంలో ఉన్న ఓ భారీ అగ్నిపర్వతం పేలి ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో విమానాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటమే ఇందుకు కారణమని సమాచారం.
తొలుత రాజన్ను మంగళవారం రాత్రికి భారత్ తీసుకురావాలని భావించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత్ నుంచి ముంబై, ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారుల ప్రత్యేక బృందం కూడా అక్కడికి వెళ్లింది. పనులన్నీ ముగించి, ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది, ఇక బయలుదేరడమే తరువాయి అనుకునే సమయంలో ఈ ఆటంకాలు ఏర్పడ్డాయి.

కాగా, మంగళవారం ఉదయం చోటా రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. ముంబై పోలీసుల పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. దావూద్ ఇబ్రహీంకు తాను భయపడనని చెప్పాడు. ముంబై పోలీసులు తనకు తీరని అన్యాయం చేశారన్నాడు.
దావూద్ ఇబ్రహీంకు, తీవ్రవాదానికి నేను వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్తో సంబంధాలున్నాయన్నాడు. ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపిస్తే ఆ జైలుకు వెళ్తానని చెప్పాడు.
ముంబై పోలీసుల పైన తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పాడు. ముంబై పోలీసులు తనను వేధించారని ఆరోపించాడు. వారు తన పట్ల చాలా నీచంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications