మళ్లీ గడువు: భారత్ను మరింత రెచ్చగొట్టేలా చైనా అడ్డుపుల్ల
జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలాడ్డింది.
బీజింగ్: జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలాడ్డింది.

15 దేశాల్లో 14 ఓకే చెప్పాయి, చైనా మాత్రం
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత సంవత్సరం మార్చిలో భారత్ చేసిన విజ్ఞప్తికి 15 దేశాల ఐక్య రాజ్య సమితి కమిటీలో 14 దేశాలు అంగీకరించాయి.

సాంకేతిక కారణాలతో అడ్డుపుల్ల
చైనా మాత్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ అడ్డుకుంటోంది. ఆగస్టు 2వ తేదీన చైనా తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తేదీ ముగియడానికి గంటల ముందే తమకు మరో మూడు నెలల సమయం కావాలని చైనా కోరింది.

మరింత రెచ్చగొట్టేలా చైనా తీరు
ఇప్పటికే భారత్-చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత చైనా తీరు ఇరుదేశాల మధ్య విభేదాలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనంగా మారుతాయంటున్నారు. మసూద్ పైన ఇప్పటికే చైనా రెండుసార్లు గడువు కోరింది.

అమెరికా ముందుకొచ్చినా
ఈలోగా గడవు పూర్తవడంతో భారత్ దరఖాస్తు చెల్లకుండా పోయింది. దీంతో ఈసారి అమెరికా ముందుకొచ్చింది. ఐరాసలో మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రతిపాదన చేసింది. చైనా మళ్లీ అభ్యంతరం తెలిపింది. ఆరు నెలల పాటు గడువు కోరింది. ఆగస్టు 2తో ఆ గడువు పూర్తవడంతో మరోసారి మూడు నెలలపాటు వాయిదా కోరింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications