కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లయిన చైనాలో వెలుగులోకి తొలి ఒమిక్రాన్ కేసు
బీజింగ్: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పుడు అనేక దేశాల్లో వ్యాపించింది. తాజాగా, కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లయినా చైనాకూ పాకిందీ ఒమిక్రాన్ వేరియంట్. చైనాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే డెల్టా ప్రభావంతో అల్లాడుతున్న చైనాకు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కూడా తోడవడంతో చైనా ప్రజలు, ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కాగా, విదేశాల నుంచి టియాంజిన్కు డిసెంబర్ 9 వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది.

తాజాగా, సదరు వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్గా నిర్ధారణ అయినట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు. డెల్టా కేసులు పెరుగుతుండటం, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వెలుగుచూడటంతో చైనాలో వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కాగా, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ వేరియంట్ దాదాపు 60 దేశాలకు పైగా వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా, బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి ఓ వ్యక్తి మరణించారు. ప్రపంచంలోనే ఒమిక్రాన్ బారినపడి ఓ వ్యక్తి మరణంచడం ఇదే తొలిది కావడం గమనార్హం.
భారతదేశంలో 44కి చేరిన ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ.. లాతూర్, ఫుణెలో ఒక్కొక్కటి కొత్త ఓమిక్రాన్ కేసు కనుగొనబడిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
లాతూర్లో 39 ఏళ్ల మహిళకు ఓమిక్రాన్ పాజిటివ్గా గుర్తించగా, పుణెలో 33 ఏళ్ల పురుషుడికి సోకినట్లు గుర్తించారు. రెండూ లక్షణరహిత కేసులు కాగా, ప్రస్తుతం వారు ఐసోలేషన్లో ఉన్నారని మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది.
'ఈ ఇద్దరు రోగుల 3 సన్నిహిత పరిచయాలు కనుగొనబడ్డాయి. అన్నీ నెగిటివ్గా గుర్తించబడ్డాయి. ఇద్దరికీ పూర్తిగా టీకాలు వేయబడ్డాయి' అని రాష్ట్ర బులెటిన్ పేర్కొంది.
అంతకుముందు రోజు, రాజస్థాన్ కోవిడ్ మ్యూటాంట్ నాలుగు తాజా కేసులను నివేదించింది. రాష్ట్రంలో మొత్తం సోకిన రోగుల సంఖ్య 13 కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. ఓమిక్రాన్-సోకిన రోగులలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ ఉన్నాయి.
Recommended Video
రెండు కొత్త ఓమిక్రాన్ కేసులతో, మహారాష్ట్రలో ప్రస్తుతం 20 మంది రోగులు కొత్త వేరియంట్ సోకగా, రాజస్థాన్లో 13 మంది ఓమిక్రాన్ బారినపడినట్లు గుర్తించారు.
వీరిలో 9 మందికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రావడంతో ఇంటికి పంపించినట్లు వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదించింది. అలాగే, తాజా ఇన్ఫెక్షన్లతో, దేశవ్యాప్తంగా ఓమిక్రాన్-సోకిన రోగుల మొత్తం సంఖ్య 44కి చేరుకుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications