చైనా కొత్తతరం క్షిపణి! ధ్వనికన్నా 10 రెట్ల వేగంతో.. ప్రపంచంలో ఎక్కడికైనా..
బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.
బీజింగ్: బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది.
డాంగ్ఫెంగ్-41 అనే ఈ క్షిపణి.. ధ్వని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. శత్రుదేశపు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలను ఏమార్చి దాడులు చేయగలదు. వచ్చే ఏడాది చైనా సైన్యం అమ్ములపొదిలో ఈ క్షిపణి చేరనుంది.

ఈ అధునాతన ఖండాంతర క్షిపణిలో మూడు అంచెలు ఉన్నాయి. అవన్నీ ఘన ఇంధనంతో పని చేస్తాయి. ఈ క్షిపణి కనీసం 12 వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. అంటే.. ప్రపంచంలో ఏ ప్రాంతంమీదైనా ఇది విరుచుకుపడగలదు.
డాంగ్ఫెంగ్-41 క్షిపణి తనతోపాటు 10 అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రయోగానంతరం.. అవన్నీ క్షిపణి నుంచి విడిపోయి.. నిర్దేశించిన రీతిలో వేరు వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. అమెరికాను దృష్టిలో పెట్టుకొనే చైనా దీన్ని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications