అంగుళం కూడా వదులుకోం, మిలటరీ వెనక్కి తగ్గలేదు: చైనా సంచలన వ్యాఖ్యలు
చైనా దేశ సర్వాధికారాలను కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా జాతీయ రక్షణ శాఖాధికారి కల్నల్ రెన్ గువాకియాంగ్ తెలిపారు.
బీజింగ్: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో డోక్లాం వివాదంలో కవ్వింపు చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టిన చైనా.. తిరిగి పాత వైఖరినే అవలంభిస్తోందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లాం సరిహద్దులోని ప్రతి అంగుళంలో సైనిక, రక్షణ బలగాలను మోహరిస్తామని తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం గమనార్హం.
చైనా దేశ సర్వాధికారాలను కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా జాతీయ రక్షణ శాఖాధికారి కల్నల్ రెన్ గువాకియాంగ్ తెలిపారు. వివాదంపై స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు డోక్లాంలో మిలటరీ తన పని తాను చేసుకుపోతుందంటూ రెన్ పేర్కొన్నారు. దీన్నిబట్టి డోక్లాం నుంచి చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా జరిగిన ప్రచారం వట్టిదేనని తెలుస్తోంది.

చైనా బలగాలు వెనక్కి తగ్గాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పు పట్టడం దీనికి బలం చేకూరుస్తోంది. డోక్లాంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి చైనా సిద్దంగా లేదని, వివాదం ప్రారంభమైన నాటి నుంచి డోక్లాంపై చైనా మిలటరీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. అయితే భారత మిలటరీతో చైనా మిలటరీ చర్చలకు సిద్దంగా ఉందని, ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామన్న తరహాలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications