కువైట్లో కరోనా కల్లోలం: 45కు చేరిన పాజిటివ్ కేసులు, ఇండియా సహా 7 దేశాలపై బ్యాన్, వెనక్కి ఫ్లైట్
కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా సహా ఏడు దేశాలపై నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులతో కలిసి కువైట్ వెళ్లిన విమానం తిరిగి వచ్చింది. కరిపూర్లో గల కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 170 మంది ప్రయాణికులతో కలిసి విమానం వెళ్లిన సంగతి తెలిసిందే.
కువైట్ నుంచి విమానం వెనక్కి రావడంతో మిగతా విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అయితే కువైట్ నుంచి విమానం వెనక్కి రావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు కువైట్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 45కి చేరాయి. ఇందులో ఒకరు భారతీయ సంతతి వ్యక్తి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే 15 మందిలో 13 మంది ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు అని కువైట్ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలోకి వచ్చిన వారిని త్వరగా పరీక్షలు చేయడంతో వైరస్ బయటపడిందని పేర్కొన్నారు. ఎమిరేట్స్కు చెందిన ముగ్గురు, సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు, ఇథియోపియా, ఇరాన్ నుంచి ఇద్దరు చొప్పున.. థాయ్లాండ్, మొరాకో, చైనా, ఇండియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారని పేర్కొన్నది. వైరస్ బారినపడ్డ వారిలో ఇద్దరు కోలుకున్నారని తెలిపారు. వైరస్ సోకినవారితో దగ్గరగా ఉన్న ఐదుగురికి కూడా పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications