కరోనా ఎఫెక్ట్: యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్యాన్, 30 రోజుల నిషేధం విధించిన పెద్దన్న..
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాపకింద నీరులా వైరస్ ప్రబలడంతో ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికా కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వైరస్ ఎక్కువగా ప్రబలుతోన్న యూరప్ నుంచి 30 రోజుల పాటు పర్యాటకులను అనుమతించబోమని అమెరికా స్పష్టంచేసింది. ఇప్పటికే అగ్రరాజ్యంలో వైరస్ సోకి 37 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,015 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో విదేశాల నుంచి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది.
Recommended Video

యూరప్ నుంచి వచ్చే అన్నిదేశాలపై నిషేధం విధించిన అమెరికా.. తమతో సన్నిహితంగా మెలిగే బ్రిటన్కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కొత్త నిబంధన శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు వైట్హౌస్లో మీడియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. అయితే అమెరికా తిరిగి వచ్చే ప్రయాణికులు.. స్రీన్ టెస్ట్లు రెండు, మూడు ఆపై ఎక్కువ సార్లు చేయించుకొని, కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన వారిని అనుమతిస్తామని పేర్కొన్నారు.

కరోనా వైరస్ నివారించడంలో యూరొపియన్ యూనియన్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. వైరస్ ప్రబలుతోన్న తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేదని చెప్పారు. కరోనా వైరస్.. ఆర్థిక మాంద్యం కాదని, ఆరోగ్యానికి సంబంధించినది అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఉంటుందని, కానీ దానిని సమూలంగా నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం పెట్టుబడిదారుల సాయం కూడా తీసుకుంటామని ట్రంప్ స్పష్టంచేశారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications