ట్రంప్కు షాక్: చైనా అధ్యక్షుడిపై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు: ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు మరోసారి యాక్టివ్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు చనిపోయారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమై ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చేశారు.
Recommended Video

చైనాపై కిమ్ ప్రశంసలు..
ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచం ముందుకు వచ్చిన కిమ్ జోంగ్ ఉన్ చైనాపై ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని అన్నారు. కరోనా కట్టడి చేసిన తీరు అభినందనీయమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు ఓ సందేశాన్ని పంపారు. జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ ఆకాంక్షిస్తున్నట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.

చైనా నుంచే వైరస్..
20 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన అనంతరం చైనాను ప్రశంసిస్తూ కిమ్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనావైరస్ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది మరణించారు. మరో 40 లక్షల మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ట్రంప్కు షాకిస్తూ.. కిమ్ వ్యాఖ్యలు..
చైనాలో కరోనాతో 4633 మంది మరణించగా, 82, 800 మంది బాధితులుగా ఉన్నారు. కాగా, చైనాతో కీలక వ్యాపార భాగస్వామిగా ఉన్న ఉత్తరకొరియాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ విషయంపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక, కరోనాను సృష్టించి ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పిందంటూ చైనా అమెరికా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో కిమ్ చైనాపై చేసిన ప్రశంసలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా కరోనా తీవ్రతకు సంబంధించిన విషయాన్ని దాచి ప్రపంచానికి భారీ ఎత్తున నష్టాన్ని కలిగించిందంటూ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ లేదా అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తునేది చర్చనీయాంశంగా మారింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications