ప్రమాదం ఆయనకు 6 లక్షల డాలర్ల పరిహార్ని తెచ్చిపెట్టింది
ప్రమాదం ఫరద్ అనే వ్యక్తికి 6 లక్షల డాలర్లు పరిహారం తెచ్చిపెట్టింది. చికాగో లోని జైలుకు ఫరద్ అనే వ్యక్తి తన కొడుకును చూసేందుకు జైలుకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు జైలులోనే ఆయన 32 గంటలపాటు గడిపాడు.
చికాగో : ఒక్క ప్రమాదం ఓ వ్యక్తికి ఆరు లక్షల డాలర్ల పరిహారం పొందేలా చేసింది. జైలు అధికారులు చేసిన పొరపాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి పరిహారం లభించేలా చేసింది. ఈ ఘటన చికాగో లో చోటుచేసుకొంది.
జైలులో ఉన్న తన కొడుకు చూసేందుకుగాను ఫరద్ పోల్క్ అనే వ్యక్తి 2014 జూలై లో చికాగో జైలుకు వెళ్ళాడు. కొడుకుతో మాట్లాడేందుకు ప్రయత్నించే సమయంలోనే ప్రమాదవశాత్తు ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఫోల్క్ జైలులో ఉండగానే పొరపాటున జైలు లాకప్ కు ఆటోమెటిక్ గా తాళం పడింది.8 అడుగులున్న లాకప్ చిన్న గదిలో ఇనేప ఊచల మద్య ఉండిపోయాడు. క్రిమినల్స్ ను ఉంచే జైలులో ఆయనన్ను ఉండిపోయాడు. అరిచి కేకలు పెట్టిన జైలు అధికారులకు విన్పించే పరిస్థితి లేదు.
కనీసం మంచినీరు, మరుగుదొడ్లు కూడ లేని పరిస్థితుల్లో ఆయన 32 గంటలపాటు జైలులో గడిపాడు. ప్రాణపాయ పరిస్థితులు వచ్చాయి. ఎట్టకేలకు జైలు అధికారులు గుర్తించడంతో అగ్నిమాపకశాఖాధికారులు గొోడను పగులగొట్టి ఆయన్ను తొలగించారు.
ఈ ఘటనపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఫరద్ కు దఅనుకూలంగా తీర్పు చెప్పింది.32 గంటలపాటు జైలులో ఉన్నందుకు గాను ఆయనకు ఆరులక్షల డాలర్లను పరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications