40 లక్షలమందిని మింగేసిన కరోనా: వైరస్ మరణాల్లో టాప్-5 కంట్రీస్ ఇవే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా మరణాల సంఖ్య ఇదివరకట్లా దూకుడుగా కొనసాగనప్పటికీ.. పూర్తి స్థాయిలో బ్రేకులు పడట్లేదు. మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైన అగ్రదేశాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్నాయి. అయినప్పటికీ- మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతోన్నాయి.

40 లక్షల మంది బలి..
ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 40 లక్షల మంది మరణించినట్లు రాయటర్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా 17,81,83,639 నమోదయ్యాయి. ఈ 4 లక్షల మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికోలది 50 శాతం వాటా ఉంది. పెరూ, హంగేరి, బోస్నియా, చెక్ రిపబ్లిక్, జీబ్రాల్టర్లల్లో ఈ కరోనా మరణాలు రేటు అధికంగా ఉంటోంది. ఆయా దేశాల జనాభా, వైరస్ బారిన పడిన వారి సంఖ్యతో పోల్చుకుంటే.. మరణాలు అక్కడ అధికంగా ఉంటోన్నాయి.

లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఛిన్నాభిన్నం..
ప్రత్యేకించి- లాటిన్ అమెరికా దేశాలు వైరస్ బారిన పడి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. గత ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 43 మంది లాటిన్ అమెరికా దేశస్థులేనని రాయటర్స్ తెలిపింది. ఈ రీజియన్కు చెందిన తొలి తొమ్మిది దేశాల్లో- వారం రోజులుగా కరోనా మరణాలు మరింత అధికమైనట్లు పేర్కొంది. బొలీవియా, చిలీ, ఉరుగ్వేల్లో కరోనా బారిన పడిన పేషెంట్లలో 25 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సున్న వారు అధికంగా ఉంటోన్నారు. ప్రత్యేకించి- బ్రెజిల్ రాజధాని సావోపోలోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల్లో 80 శాతం కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి.

శ్మశానాలు ఫుల్
కరోనా మరణాతో లాటిన్ అమెరికా సహా పలు దేశాలు కొత్తగా శ్మశానాలను విస్తరించుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నట్లు రాయటర్స్ తెలిపింది. అనేక దేశాల ప్రభుత్వాలు శ్మశానాల కోసం ఇదివరకెప్పుడూ లేనంతగా స్థలాలను కేటాయించాల్సి వచ్చిందని పేర్కొంది. రోజురోజుకూ మరణాలు పెరుగుతోండటంతో సముద్ర తీర ప్రాంతాలు, పార్కులు, జన సంచారం పెద్దగా లేని చోట్ల మృతదేహాలను ఖననం చేయడానికి అనుమతులను మంజూరు చేశాయి.

ఆ విషయంలో భారత్ టాప్
వారం రోజుల్లో చోటు చేసుకున్నమరణాలు సగటును పరిగణనలోకి తీసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. రెండున్నర నెలలుగా భారత్లో కరోనా మరణాలు రెండు నుంచి నాలుగు వేల వరకు నమోదైన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో మరణాల సంఖ్య మరే దేశంలోనూ నమోదు కాలేదు. గరిష్ఠంగా ఒక్కరోజు వ్యవధిలో నాలుగు వేలకు పైగా కోవిడ్ సంబంధిత మరణాలు భారత్లో నమోదయ్యాయి. వాటి సంఖ్య ప్రస్తుతం రెండువేలకు పైగా కొనసాగుతోంది. వారం రోజుల సగటులో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. అక్కడా ఇదే తరహా దుస్థితి నెలకొంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications