ఎయిర్ షో, రెండు విమానాలు ఢీ: సజీవదహనం
స్లోవేకియా: ఎయిర్ షో కోసం విమానాలు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విషాదం చోటు చేసుకునింది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో 7 మంది సజీవదహనం అయిన సంఘటన స్లోవేకియాలోని బ్రటిస్లావా ప్రాంతంలో జరిగింది.
గురువారం ఎయిర్ షో కోసం విమానాలు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆ సందర్బంలో పర్వత ప్రాంతాలలో రెండు విమానాలు ఆకస్మికంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు విమానంలో ఉన్న చాల మంది ప్యారాచుట్ల ద్వార కిందకి దూకేశారు.
శుక్రవారం స్థానిక మీడియా ఈ విషయం వెల్లడించింది. ఈ రెండు విమానాలలో 40 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. విమానాల శిథిలాలు చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని పర్వత ప్రాంతాలలో పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న సైన్యం మూడు ప్రత్యేక హెలికాప్టర్లలతో సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్ షో నిర్వహించిన ల్లవ్వా రాజధాని బ్రటిస్లావాకు 150 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.