పైకప్పు కూలిపోయిన ఘటనలో 160 మంది మృతి
చర్చి పై కప్పు కూలిన ఘటనలో 160 మంది చనిపోయారు. ఈ ఘటన నైజీరియాలో చోటుచేసుకొంది. ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పర్వదినానికి ఈ భవనాన్ని సిద్దం చేసే ఉద్దేశ్యంతో త్వరగా పనులు చేస్తున్
నైజీరియా :నైజీరియాలో చోటుచేసుకొన్న ప్రమాదం 160 మంది ప్రాణాలను బలిగొంది. ఓ చర్చి పైకప్పు కూలి 160 మంది మరణించారు. ఉయోలోని రిగ్ నర్స్ చర్చి పై కప్పు కూలిన ఘటనలో 160 మంది మరణించారు.
చర్చిలో ఆదివారం నాడు జరిగిన మత కార్యక్రమానికి పెద్ద ఎత్తున క్రైస్తవులు హజరై ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. అక్వాఇబామ్ రాష్ట్ర గవర్నర్ కూడ ఈ సంఘటన జరిగిన సమయంలో చర్చిలోనే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన తప్పించుకొన్నారని అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహరీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. చర్చి పై కప్పు కూలిన ఘటనలో శకలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.తొలుత 60 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని ఉడోం ఇమన్మాన్యువల్ దర్యాప్తుకు ఆదేశించారు. చర్చి నిర్మాణదశలోనే ఉంది. క్రిస్మస్ సమీపిస్తోంది. అయితే క్రిస్మస్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావించారు.అయితే పై కప్పు పనులను త్వరగా పూర్తి చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొందని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications